నారా లోకేష్పై మంత్రి ఉత్తమ్ ఫైర్: "పొత్తు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతావా
NEWS Aug 02,2025 05:04 pm
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ, టీడీపీ పొత్తు ఉందని లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తు చేస్తూ, చట్టవిరుద్ధమైన బనకచర్ల ప్రాజెక్టుపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఉత్తమ్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే బనకచర్ల నిర్మాణం సాధ్యమని స్పష్టం చేశారు.