బనకచర్ల ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
NEWS Aug 02,2025 04:27 pm
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్, టీడీపీలు కలిసి తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్, ఏపీ మంత్రి నారా లోకేష్ల రహస్య సమావేశంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, బనకచర్ల ప్రాజెక్టు వృథా జలాల కోసమేనని లోకేష్ చెప్పినా, దాని వెనుక ఉద్దేశాలపై సందేహాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పలు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో జలాలు వృథాగా పోతున్నాయని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపినట్లు భట్టి వెల్లడించారు.