పాతాళంలో దాక్కున్నా వదలం: పాక్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక
NEWS Aug 02,2025 03:59 pm
భారత్పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని, అన్యాయాన్ని అణచివేసేందుకు అవసరమైతే భారత్ 'కాళభైరవుడి' రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ప్రపంచం భారతదేశ రుద్ర రూపాన్ని చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.