స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి
NEWS Aug 04,2025 11:49 am
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసే దిశగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ నాయకుల సమావేశానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.