ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్పై విరుచుకుపడిన భారత్
NEWS Jul 23,2025 03:56 am
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ను "మతోన్మాదం, ఉగ్రవాదంలో కూరుకుపోయిన, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి సీరియల్ రుణగ్రహీత"గా అభివర్ణించింది. అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం, ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాల పరిష్కారం అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో భారత్ శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.