ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు
NEWS Jul 23,2025 08:58 am
ప్రముఖ పుణ్య క్షేత్రం, భక్తుల కొంగుబంగారంగా కొలిచే విజయవాడలో కొలువు తీరిన ఇంద్రకీలాద్రి ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వెల్లడించారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరుగుతాయని, ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సారి జరగబోయే ఉత్సవాలకు సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.