గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నర్ తెలంగాణ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. హైదరాబాద్ బోనాల పండుగ సందర్భంగా ఈ ప్రకటనను విడుదల చేసింది. స్వయంకృషితో ఎదిగిన రాహుల్ యువతకు మార్గదర్శకుడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ పాడిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.