గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న ఆరోపించారు. పినపాక మండలం సీతారాంపురం గ్రామం వద్ద మండల కార్యదర్శి దుబ్బా గోవర్ధన్ ఆధ్వర్యంలో సిపిఎం ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు.చట్టంలో 125 రోజులకు పని దినాలు పెంచుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉపాధి కార్మికులకు ఆ మేరకు పనులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.