డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
NEWS Jun 30,2026 06:50 pm
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ కార్పొరేటర్ చెరకు భాగ్యలక్ష్మి పాల్వంచ డివిజనల్ అదనపు కమిషనర్ విజయ ఆనంద్ను కోరారు. వర్షాకాలంలో డ్రైనేజీ పొంగిపొర్లి అసంపూర్తి ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ నగర్లోకి బురద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.