బోనాల పండుగ సందర్భంగా ప్రజావాణి రద్దు
NEWS Jul 20,2025 02:12 pm
బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ అధికారులకు ప్రకటించిన సెలవు నేపథ్యంలో, ఈ నెల 21 వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు. తదుపరి ప్రజావాణి కార్యక్రమాన్ని రాబోయే సోమవారం (జూలై 28 న) యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.