భారత్ పరాజయం.. సిరీస్ సమం చేసిన ఇంగ్లండ్
NEWS Jul 20,2025 08:14 am
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన ఈ వన్డేలో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ను 29 ఓవర్లకు కుదించారు.