హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ ముఠా గుట్టురట్టు
NEWS Jul 20,2025 08:10 am
నకిలీ కాల్ సెంటర్ ద్వారా సామాన్య ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన కొందరు వ్యక్తులు నగరంలోని బాచుపల్లిలో ఒక విల్లాను అద్దెకు తీసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, ఆకస్మిక దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.