ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
NEWS Jul 20,2025 08:08 am
2025- 26 ఏడాదికి గాను అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి SC విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు JGTL జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి తెలిపారు. USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్ యూనివర్సిటీల్లో PG చదవాలనుకుంటున్న వారు ఆగస్ట్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.20 లక్షలు, వీసా, టికెట్ ఫెయిర్ మంజూరు చేస్తామన్నారు.