ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. శనివారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో భజన సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయార్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.