ఎమ్మెల్యేను సన్మానించిన గ్రామస్తులు
NEWS Jul 19,2025 10:13 pm
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుబిడి పల్లె గ్రామస్తులు తమ గ్రామానికి రూ.10 లక్షలతో మంజూరైన మొరం రోడ్డు కు కృషి చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను శనివారం కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంతో తమ గ్రామ సమస్య తీరుతుందని పేర్కొన్నారు.. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రత్నప్రభ సంతోష్, లింబాజి, తదితరులు ఉన్నారు.