పారిశుద్ధ్య కార్మికులు నిజమైన సమాజ సేవకులు
NEWS Jul 19,2025 04:15 pm
పారిశుద్ధ్య కార్మికులు నిజమైన సమాజ సేవకులని, వారి వల్లనే స్వచ్ఛ భారత్ మిషన్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛ సర్వేక్షణ్లో 5 అవార్డులు సాధించామన్నారు. స్వచ్ఛ సూపర్ లీగ్-2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో కూడా మనం మరిన్ని పురస్కారాలను అందుకోవాలని పిలుపునిచ్చారు.