ఏపీ ఎంపీలకు పౌరుషం లేదు - షర్మిల
NEWS Jul 19,2025 04:20 pm
ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలుగా మారారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. దమ్ము, ధైర్యం, పౌరుషం అనేది ఉంటే ఈ రాష్ట్ర బిడ్డలే అయితే.. మీలో పారుతుంది చీము నెత్తురే అయితే.. మోడీ తొత్తులు కాదనుకుంటే.. రాష్ట్ర ప్రయోజనాలే మీకు ముఖ్యం అనుకుంటే.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు ప్రస్తావించకుండా తమ స్వప్రయోజనాలకే ప్రయారిటీ ఇవ్వడం దారుణమన్నారు.