ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దారివెంట వెళ్ళే వ్యక్తులను బెదిరించడమే కాకుండా వెంటపడి మరీ కరుస్తున్నాయి. ఈ ఉదయం పెసర రాజేష్ అనే వ్యక్తి దారిన వెళుతుండగా కుక్కలు అతని మీద పడి విపరీతంగా కరచి గాయపరిచాయి . గ్రామస్తులు కుక్కలను తరిమికొట్టారు. పెసర రాజేష్తీ కువ్ర గాయాలు కాగా 108 వాహనంలో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.