పంట మార్పిడితోనే అధిక దిగుబడులు సాధ్యమని గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన ఆదర్శ రైతు అల్లూరి ఉత్తమ్ పేర్కొన్నారు. తన వ్యవసాయ భూమిలో ఒక ఎకరంలో 15 క్వింటాళ్ల పత్తిని పండించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్ను గ్రామస్తులు శాలువాతో సత్కరించి అభినందించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు.