ఉట్నూర్ మండలం పెర్కగూడలో ఈ నెల 25వ తేదీన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆధ్వర్యంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాథోడ్ అవినాష్ తెలిపారు. ఈ సందర్బంగా వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఉదయం 10గం.ల నుంచి సాయంత్రం 5గం.ల వరకు జరిగే జాబ్ మేళాను నిరుద్యోగులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.