ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పారు. నమాజ్ చెరువు కట్టపై ఆయన విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం దారుణమని అన్నారు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ మహనీయులకు ఇలాంటి అవమానాలు జరగడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.