రోడ్డుపై బైఠాయించిన పారిశుద్ధ్య కార్మికులు
NEWS Jul 19,2025 05:27 pm
కనిగిరి మున్సిపాలిటీలో సమ్మెలో ఉన్న పారిశుద్ధ కార్మికులు శనివారం చెత్త తరలిస్తున్న ట్రాక్టర్ ను ఒంగోలు బస్టాండ్ సెంటర్లో అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. సమ్మెలో ఉండగా చెత్తను ఎలా తరలిస్తారని , అధికారులు నిర్లక్ష్యం వీడాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. చెత్త ట్రాక్టర్ లోని చెత్తను రోడ్డుపై పడవేసి నిరసన తెలిపారు.