ఓడిపోతే బాగుండేది... ఇంట్లో కూర్చునేవాడిని: మల్లారెడ్డి అసహనం
NEWS Jul 19,2025 10:26 am
మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో చేశానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు కనీస గౌరవం కూడా దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. తాను ఓడిపోతే బాగుండేదని... ఇంట్లో కూర్చునేవాడినని చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.