పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
NEWS Jul 19,2025 10:03 am
కనిగిరి పట్టణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించారు. హైవే రోడ్డు లోని డివైడర్స్ మధ్యలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. డిడిఓ కే శ్రీనివాసరెడ్డి,మున్సిపల్ కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు.