బోథ్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మకు నైవేద్యం బోనంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విద్యార్థులకు బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని పేర్కొన్నారు.