రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి
NEWS Jul 19,2025 06:47 am
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. స్థానికులకు రేషన్ కార్డ్ పత్రాలను అందజేశారు. పేదలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.