మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. రెస్టారెంట్ ఓనర్ సూర్య పబ్ ఓనర్సతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారని తేలింది. కిచెన్ రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు.