టీడీపీ సభ్యత్వానికి అశోక్ గజపతిరాజు రాజీనామా
NEWS Jul 18,2025 04:25 pm
గోవా గవర్నర్ గా నియమితులైన మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీ పొలిటి బ్యూరో పదవికి రాజీనామా చేశారు. త్వరలో బాధ్యతలు తీసుకోనున్నారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన లేఖను పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు పంపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి సైనికుడిలా పని చేశానని, ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించారని పేర్కొన్నారు. టీడీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. గవర్నర్ గా నియమింపబడిన వారు ఏ పదవిలో ఉండకూడదు.