భానుపై చర్యలు తీసుకోండి: రోజా
NEWS Jul 18,2025 12:43 pm
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పై మాజీ మంత్రి రోజా జాతీయ మహిళా కమిషన్ కు, ఏపీ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రూ. 2 వేలు ఇస్తే రోజా ఏ పనైనా చేసేదని... అలాంటి రోజా ఇప్పుడు రూ. 2 వేల కోట్లు సంపాదించిందని తన గురించి భాను ప్రకాశ్ చులకనగా మాట్లాడారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తనను వ్యాంప్ కు ఎక్కువ... హీరోయిన్ కు తక్కువని నీచమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.