అమరావతి ఓఆర్ఆర్ పనుల్లో వేగం.. భూసేకరణకు రూ.5,300 కోట్లు
NEWS Jul 18,2025 02:26 pm
ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకే దాదాపు రూ.5,000 కోట్లు, అటవీ భూముల కోసం మరో రూ.300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఎన్హెచ్ఏఐ ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తం 189 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ఓఆర్ఆర్.. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా వెళ్లనుంది. దీనికోసం సుమారు 3,400 హెక్టార్ల ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూములతో పాటు 250 హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు.