జగన్ హయాంలో ఉత్తరాంధ్ర నాశనం
NEWS Jul 18,2025 12:32 pm
ఎంపీ అప్పలనాయుడు మాజీ సీఎం జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. రూ. 500 కోట్లు పెట్టి రిషికొండను ఎందుకు కట్టారో చెప్పాలని అన్నారు. ల్యాండ్ కబ్జాలు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ బాధితులు పెద్ద ఎత్తున గ్రీవెన్స్ కు వస్తున్నారని అన్నారు. కూటమి పాలనలో భోగాపురం ఎయిర్ పోర్ట్, స్టీల్ ప్లాంట్ అభివృద్ధితో పాటు యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. గిరిజన యూనివర్శిటీని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు.