పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
NEWS Jul 18,2025 10:54 am
పట్టణంలోని నీరు, పారిశుధ్యం, వీధి బల్బులు తదితర మౌలిక వసతులపై ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కారం చేయాలని మునిసిపల్ కమీషనర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కనిగిరి పట్టణంలోని ప్రధాన రోడ్డులలో జరుగుతున్న పారిశుధ్య పనులను మునిసిపల్ కమీషనర్ పరిశీలించారు.కాలువల్లో మట్టి పూడికలను తొలగించడం, వీధుల్లో చెత్త సేకరణను బాగా నిర్వహించడం పై ముఖ్యంగా దృష్టి పెట్టాలన్నారు.