నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ టూర్
NEWS Jul 18,2025 09:37 am
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జటప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పూజలు చేసిన అనంరతం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.