తాజావుద్దీన్ ఉత్సవాలకు నిర్మల్ నుంచి లగ్జరీ బస్సులు
NEWS Jul 18,2025 09:30 am
మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో జరగనున్న తాజా వుద్దీన్ బాబా రహమతుల్లాలై వారి ఉరుసు షరీఫ్ సందర్భంగా నిర్మల్ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టిసి డిఎం బండారి తెలిపారు.. 30 - 35 మంది సమకూరి తమను సంప్రదిస్తే తక్షణమే సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తామని అన్నారు. మరిన్ని వివరాల కోసం 9959226003, 8328021517 నంబర్లను సంప్రదించాలన్నారు.