సిగాచి ఘటనలో 46కి చేరిన మృతుల సంఖ్య
NEWS Jul 18,2025 09:25 am
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ లోని పాశమైలారం ఘటనలో 46కి చేరింది మృతుల సంఖ్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దివాకర్ అనే మరో కార్మికుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగి 18 రోజులు గడిచినా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు.