ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత
NEWS Jul 18,2025 09:32 am
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని కందుకూరు రోడ్లో జీప్ సెంటర్లో పారిశుధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పిల్లి కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.