ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి
NEWS Jul 17,2025 09:33 pm
ఫోక్సో చట్టం పట్ల విద్యార్థుల్లో పూర్తిస్థాయి అవగాహన తప్పనిసరని నిర్మల్ ఎస్సై లింబాద్రి అన్నారు. గురువారం మంజులాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాథమిక స్థాయి విద్యార్థి దశ నుంచి ఆయా చట్టాల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించే బాధ్యత అందరిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు...