ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు
NEWS Jul 17,2025 09:34 pm
బాలశక్తి కార్యక్రమంలో భాగంగా గురువారం సోన్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజరు రామ్ గోపాల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్డిఎం మాట్లాడుతూ విద్యార్థులంతా పాఠశాల స్థాయి నుంచే ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, పొదుపు, తదితర బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్ని ఆర్థిక అక్షరాస్యత కిందికి వస్తాయన్నారు. బ్యాంకుల్లో ఉపయోగించే వివిధ రకాల ఫారములను గురించి విద్యార్థులకు వివరించారు.