స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకున్న మేయర్
NEWS Jul 17,2025 06:05 pm
స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు ను తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. తిరుపతి నగరం ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును తిరుపతి నగర ప్రజలకు అంకితం ఇస్తున్నామని ప్రకటించారు. నాతోటి కార్పొరేటర్లు , కమిషనర్ నాయకత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో తిరుపతి నగర ప్రజలు అందించిన సహకారం మరువలేనని అన్నారు.