నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ద్వారా వానాకాలం పంటల కోసం నీటిని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరిమ్మకు శాస్రోత్తకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు సకాలంలో వరి నాట్లను వేసుకోవాలన్నారు. స్వర్ణ ప్రాజెక్టు క్రింద ఉన్నటువంటి సాగు భూములన్నింటికీ సాగు నీరందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులతో పాటు మండల నాయకులు పాల్గొన్నారు.