అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఉమ్రీకి చెందిన రాజాసింగ్, సేవక్ సింగ్, సుదీప్ సింగ్ ఇటీవల జిల్లాలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలీసులు వీరిని పట్టుకున్నారు..2.7 కిలోల వెండి, 17 గ్రాముల బంగారం రూ.2500 నగదు 2 బైక్ లు సీజ్ చేశారు.