21న పాఠశాలలు, కాలేజీలకు సెలవు
NEWS Jul 17,2025 04:25 pm
తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. బోనాలు పండుగ కారణంగా తెలంగాణ ప్రభుత్వం జూలై 21న నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. విద్యార్తులు, టీచర్లు, పేరెంట్స్ కు ఖుష్ కబర్ చెప్పింది. గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వేడుకలు ఇప్పటికే ముగిశాయి. జూలై 20న లాల్ దర్వాజా బోనాలు జరుపుతారు. బోనాలు పండుగ కోసం పోలీసు దళం క్లిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. 21ని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించడంతో పాటు సాధారణ సెలవు దినంగా వాడుకోవచ్చని స్పష్టం చేసింది.