నష్ట పరిహారం పెంచి ఇవ్వాలని రైతుల ధర్నా
NEWS Jul 17,2025 05:52 pm
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణపేటలో పేరపళ్ల గ్రామ రైతులు ధర్నా చేశారు. అంతకు ముందు సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 14 లక్షలు మాత్రమే ఇస్తున్నారని, దానిని 25 లక్షలకు పెంచి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధర్నాకు కమ్యూనిస్టు పార్టీ, రైతు సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.