ఢిల్లీ నుంచి కర్నూలుకు బయల్దేరిన చంద్రబాబు
NEWS Jul 17,2025 11:58 am
ఢిల్లీ పర్యటనను ముగించుకున్న చంద్రబాబు నేరుగా కర్నూలుకు బయల్దేరారు. నేడు నంద్యాల జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆల్లూరుకు చేరుకుంటారు. 1 గంటకు మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేస్తారు. హంద్రీనీవా కాలువలో జలాలకు జలహారతి ఇవ్వనున్నారు.