నంద్యాలః నేడు నందికొట్కూరులో సీఎం చంద్రబాబు పర్యటన
NEWS Jul 17,2025 09:37 am
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరులో పర్యటన చేపడతారు. మధ్యాహ్నం అల్లూరు చేరుకుని, ఒంటి గంటకు మల్యాలలో హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు రైతుల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో రైతుల సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉంది.