ఎమ్మెల్సీ కవిత కు కేటీఆర్ బిగ్ షాక్
NEWS Jul 17,2025 07:37 am
ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TGBKS) ఇంచార్జ్ గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో సంఘం నేతలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. BRS అనుబంధంగా ఏర్పడిన TGBKS కు ఎమ్మెల్సీ కవిత ఇప్పటి వరకు గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ నియామకం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.