వాహనదారులకు టంగుటూరు ఎస్సై వార్నింగ్
NEWS Jul 17,2025 06:56 am
ప్రకాశం జిల్లా టంగుటూరులో సైలెన్సర్లను పెద్దగా సౌండ్ వచ్చే విధంగా మార్చి, వాటి ద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న ద్విచక్రవాహనదారులను పట్టుకొని వాళ్ల చేతనే, ఆ సైలెన్సర్లను తీపించి కౌన్సెలింగ్ నిర్వహించారు టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు.సైలెన్సర్లను గనక మారిస్తే ద్విచక్ర వాహనాలను, సీజ్ చేసి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. వారిపై కేసులు నమోదు చేసి,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.