పేకాట స్థావరంపై పోలీసుల దాడి
NEWS Jul 17,2025 07:02 am
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లిలో పేకాట స్థావరంపై ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురి నుంచి 38 వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా పేకాట ఆడినా, గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేకరించిన 100కు సమాచారం అందజేయాలని అన్నారు.