బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్
NEWS Jul 17,2025 06:59 am
రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ విమర్శించారు. అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశములో మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేశాయని చెప్పారు. బీసీలను స్థానిక సంస్థల ఎన్నికలకు పరిమితం చేయకుండా ఎమ్మెల్యే, ఎంపి స్థానాలు కేటాయించాలని, బిసి ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు.