మంగళగిరిలో మరో 2వేలమందికి త్వరలో ఇళ్ల పట్టాలు: మంత్రి లోకేశ్
NEWS Jul 16,2025 01:44 pm
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో 2వేల మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి ఈ రోజు ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్షించారు.